జాతీయ రహదారిపై అత్యధికంగా ప్రమాదాలు జరగడానికి గల కారణాలను ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి డిఆర్సి సమావేశంలో లేవనెత్తారు. ఒంగోలు, టంగుటూరు ప్రాంతాలలోని 16వ నంబర్ జాతీయ రహదారికి ఉన్న ఫెన్సింగ్ పోవడం వల్లే అత్యధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయని సర్వీస్ రోడ్లు పరిస్థితి ఇప్పుడు ఒకసారి అధికారులు పరిశీలించాలని ఎంపీ మాగుంట అధికారులకు సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు జాతీయ రహదారిపై పెన్సింగ్ ఏర్పాటు చేయడంతో పాటు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.