మల్కాజిగిరి డివిజన్ సఫిల్గుడా ప్రాంత ప్రజల్లో ఎన్నో ఏళ్ల ఆకాంక్ష అయిన రైలు అండర్ బ్రిడ్జ్ మంజూరు కావడం ఎంతో ఆనందంగా ఉందని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మాజీ కార్పొరేటర్ నిర్గుండా జగదీష్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కృతజ్ఞత సభలో ఆదివారం వారు పాల్గొన్నారు.