ప్రకాశం జిల్లా ఒంగోలులోని రూడ్సెట్ కార్యాలయంలో ఈనెల 24 నుంచి 31 రోజులపాటు నిరుద్యోగ మహిళలకు ఎంబ్రాయిడరీ, మగ్గం వర్పై ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి సోమవారం సాయంత్రం ఆరు గంటల 30 నిమిషాలకు తెలిపారు. ఆధార్, రేషన్ కార్డు ఉండి, గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు అర్హులన్నారు. శిక్షణా కాలంలో ఉచితంగా భోజనం వసతి సౌకర్యాలను కల్పిస్తామన్నారు. వివరాలకు ఒంగోలులోని దామచర్ల సక్కుబాయమ్మ కాలేజీ గేటు వద్ద గల రూడ్సెట్కు రావాలన్నారు.