అనంతపురం నగరంలోని శ్రీకంఠం సర్కిల్ లో ఉన్న మమత హోటల్ వెనుక భాగంలో గోపి అనే యువకుడిపై ప్రవీణ్ మరియు మనీ అనే ఇద్దరు యువకులు కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచిన ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. దీంతో యువకుడిని హుటా హుటినా అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.