కొడంగల్: దోమ మండల కేంద్రంలోని జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో విద్యార్థులకు సైబర్ క్రైమ్ ఆన్లైన్ మోసాలపై అవగాహన కల్పించిన షీ టీం, పోలీసులు
జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు నేడు బుధవారం వికారాబాద్ జిల్లా దోమ మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో పరిగి సబ్ డివిజన్ షీ టీం ఇన్చార్జి నర్సింలు, ఎస్సై వసంత్ జాదవ్ ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్, ఆన్లైన్ మోసాల పట్ల విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బాల్య వివాహాల నిర్మూలన బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని తెలిపారు. మద్యపాన నిషేధం కమ్యూనిటీ పోలీసింగ్ మానవ అక్రమ రవాణా పై అవగాహన కల్పించడం జరిగింది సైబర్ క్రైమ్ ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. బాల్య వివాహాలు చేసిన ప్