ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం సోమరాజు పల్లి గ్రామ సమీపంలోని చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం శనివారం కలకలం రేపింది. చెరువులో తేలియడుతున్న మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికి తీశారు. మృతుడి వివరాలు తెలియకపోవడంతో పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోస్టుమార్టం కొరకు స్థానిక ఆసుపత్రికి తరలించిన పోలీసులు అన్నారు.