బంగారు పాల్యం మండలంలోని మొగిలి ఆలయంలో 2026 జనవరి ఒకటవ తారీఖు నుండి డిసెంబర్ 31 వ తారీకు వరకు ఒక సంవత్సరం రోజులకు గాను బుధవారం జరిగిన వేలంపాటలో నాలుగు లక్షల మూడు వేల రూపాయల అత్యధిక పాట పాడి, ఎయిర్ ఎంటర్ప్రైజెస్ యాదగిరి వారు పాట దక్కించుకున్నారు. మొగిలి ఆలయ అభివృద్ధికి టెండర్ల ద్వారా అధిక మొత్తంలో టెండర్లు ఎత్తడం ద్వారా ఆలయం అభివృద్ధి చెందుతుందని ఈవో మునిరాజులు తెలిపారు.