పెద్దపప్పూరు మండలం పెద్ద ఎక్కులూరు గ్రామంలో మంగళవారం అనంతపురం ఆర్డీవో ఆది కేశవులు నాయుడు పర్యటించారు. చాగల్లు ప్రాజెక్టు వల్ల తమ కాలనీలో నీళ్లు ఉబికి బయటకు వస్తున్నాయని పునరావాసం కల్పించాలని పెద్ద ఎక్కులూరు ఎస్సీ కాలనీవాసులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆర్డీవో పర్యటించారు. మీ ఇబ్బందులను ఎస్సీ కమిషన్, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటానన్నారు.