ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పలు గ్రామాలలో ఏవో తిరుమలరావు రైతులకు యురియా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రైతు వేసిన పంటను తప్పనిసరిగా ఈ క్రాప్ బుకింగ్ లో నమోదు చేయించుకోవాలని సూచించారు. పంట నమోదుకు చివరి తేదీ 30 అక్టోబర్ 2025 గా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ సూచనలు సలహాలను రైతులు తప్పనిసరిగా పాటించాలని ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే రైతు సేవా కేంద్రం నందు సిబ్బందిని సంప్రదించాలని కోరారు.