ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం సోమవరప్పాడు గ్రామంలోని గుంటి గంగమ్మ దేవత దేవస్థానం వద్ద చైర్మన్ గురుబ్రహ్మ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన అన్నదాన సత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రిబ్బన్ కత్తిరించి అన్నదాన సత్రం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి ఫలాలను ప్రజలు లబ్ధి పొందుతూ సంతోషంగా ఉన్నారని అన్నారు. కార్యక్రమంలో టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.