ఉప్పల్ డివిజన్ లోని సూర్య నగర్ లో కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. ఈ కాలనీలో 42 లక్షలతో సిసి రోడ్ల నిర్మాణం పనులను డి వెన్నెల గౌడ్, ఏ ఈ రాజ్ కుమార్, హెచ్ఎమ్డబ్ల్యూఎస్ అధికారి సత్యనారాయణ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తొందర్లోని సూర్య నగర్ కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణం పనులు జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎస్ ప్రసాద్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.