పార్టీని క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేసుకుందామని ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు.. గురువారం రాత్రి 8 సమయంలో 53 వ డివిజన్లో కోటి సంతకాల కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆయన ప్రచారం చేపట్టారు. ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వస్తుందని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.