అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో సెట్టూరు రోడ్డులో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో కళ్యాణదుర్గానికి చెందిన మనోహర్ వంశీ లు తీవ్రంగా గాయపడ్డారు. వారిని మనోహర్ ను అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించగా వంశీని నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.