అనంతపురం నగరంలోని కె ఎస్ ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు మత్తుపదార్థాల వినియోగం వల్ల కలిగే నష్టాలు అనర్థాల గురించి అవగాహన కార్యక్రమాన్ని ఈగల్ టీం ఎస్సై హనుమంతు వివరించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రాష్ట్ర డిజిపి ఉత్తర్వుల మేరకు జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలను వేగవంతంగా నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఈగల్ టీంకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు.