ప్రకాశం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం కలెక్టర్ రాజాబాబు గ్రంథాలయా వారోత్సవాల పోస్టర్లు ఆవిష్కరించారు. ఈనెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 58వ గ్రంథాలయ వారోత్సవాల కార్యక్రమాలు జరుగుతున్నాయని ఈ కార్యక్రమాలను వినియోగించుకొని విద్యార్థులు తమ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు. ప్రతి సంవత్సరం నిర్వహించే గ్రంథాలయ వారోత్సవాలలో విద్యార్థులకు పోటీ పరీక్షలు వివిధ అంశాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.