ప్రకాశం జిల్లా దోర్నాల పట్టణంలో సెమీ క్రిస్మస్ సందర్భంగా స్థానికులు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా టిడిపి ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానంగా దోర్నాల పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ ను త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. మండలంలోని ప్రతి సమస్యను దశలవారీగా పరిష్కరించడం జరుగుతుందన్నారు. అభివృద్ధి సంక్షేమం దిశగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు.