కళ్యాణదుర్గంలోని శ్రీ సుబ్రమణ్యేశ్వర స్వామి ఆలయంలో బుధవారం సుబ్రమణ్యం షష్టి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్రమణ్యేశ్వర స్వామి రథోత్సవాన్ని నిర్వహించారు. మహిళా భక్తులు కోలాటం చేస్తూ సందడి చేశారు. భక్తులు తమ మొక్కుబడులు తీర్చుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు తీర్థప్రసాదాలు వినియోగం చేశారు. ఆలయంతో పాటు పరిసరాల్లో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది.