తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జే సీ ప్రభాకర్ రెడ్డి అనారోగ్యం కారణంగా ఇటీవల ఆపరేషన్ చేయించుకున్న విషయం తెలిసిందే. ఆపరేషన్ అనంతరం కోలుకొని తాడిపత్రి వచ్చారు. సమాచారం తెలుసుకున్న ఆదోనికి చెందిన ప్రముఖ ముస్లిం మత గురువు సయ్యద్ నూరుల్ సోమవారం తాడిపత్రి వచ్చారు. ప్రభాకర్ రెడ్డిని పరామర్శించారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.జేసీ మత గురువుకు కృతజ్ఞతలు తెలిపారు.