స్వామిత్వ కార్యక్రమం ద్వారా ఆస్తి వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఏపీ మారీ టైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య అన్నారు. శనివారం సింగరాయకొండలో జరిగిన స్వామిత్వ అవగాహన కార్యక్రమంలో దామచర్ల సత్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎన్నో ఏళ్ల నాటి ఆస్తి వివాదాలు కూడా స్వామిత్వ కార్యక్రమంలో పరిష్కరించుకోవచ్చని సత్య వెల్లడించారు. మనం లోన్లు పొందాలన్నా మన ఆస్తులు ఎటువంటి వివాదాలలో ఉండకూడదు అనే విషయాన్ని ప్రజలు గమనించాలని ప్రజలకు మేలు చేసేందుకే ప్రభుత్వం ఈ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని సత్య పేర్కొన్నారు.