డిసెంబర్ 7న ముఖ్యమంత్రి రాకను ఓయూ విద్యార్థులు స్వాగతిస్తున్నామని, వందేళ్ళ చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఓయూ విద్యార్థి, టిపిసిసి అధికార ప్రతినిధి చెరగాని దయాకర్ అన్నారు. ఓయ్ ఆర్ట్స్ కళాశాల వద్ద ఏర్పాటు చేస్తే పత్రిక సమావేశంలో వారు మాట్లాడారు. గత ప్రభుత్వం నిధులు, నియామకాలు చేపట్టకుండా విశ్వవిద్యాలయాన్ని నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. వందేళ్ల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీకి ఏ ముఖ్యమంత్రి రెండుసార్లు రాలేదని, అయితే రేవంత్ రెడ్డి వస్తున్నారని తెలిపారు.