కళ్యాణదుర్గం: చెర్లోపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే సురేంద్రబాబు
సెట్టూరు మండలం చెర్లోపల్లి గ్రామం బుధవారం ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను ఎమ్మెల్యే సురేంద్రబాబు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన సచివాలయ, గ్రామపంచాయతీ టీడీపీ నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్ సొమ్ము ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. సామాజిక పెన్షన్లను చాలా పగడ్బందీగా పంపిణీ చేయిస్తున్నామన్నారు. ఉదయం 6 గంటల నుంచి పెన్షన్లు పంపిణీ ప్రారంభమైందన్నారు.