జిల్లాలో ఖరీఫ్ 2025-26 సీజన్లో ఈనెల 16వ తేదీ వరకు 212 మంది రైతుల నుండి రూ.3.99 కోట్ల విలువగల 1779.6 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ చెప్పారు. మంగళవారం ప్రకాశం భవనంలోని తన చాంబర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లాలో రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ద్వారా ధాన్యం సేకరణ తీరు, సాధిస్తున్న పురోగతిని ఆయన వివరించారు. ఇప్పటివరకు రూ.3.98 కోట్లను 211 మంది రైతులకు చెల్లించినట్లు చెప్పారు. మిగిలిన డబ్బులను తదుపరి బ్యాంకు బ్యాచ్ ప్రాసెస్ నందు జమ చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో లేట్ ఖరీఫ్, ఎర్లీ రబీ సాగును దృష్టిలో పెట్టుకుని కొనుగోలు చేయడం జరుగుతుందన్నా