ఖమ్మం అర్బన్: కూర వేయలేదని మహిళపై గొడ్డలితో దాడి
ఖమ్మం ఖానాపురం ఇండస్ట్రియల్ ఏరియాలో బానోత్ రుక్మిణీ అనే మహిళపై గొడ్డలితో దాడి జరిగింది. కిటికీలు తయారు చేసే కంపెనీలో పనిచేస్తున్న రుక్మిణీ అన్నం తింటుండగా రవి అనే కార్మికుడు కూర అడిగాడు. ఆమె కూర తన వరకే ఉందని చెప్పడంతో ఆగ్రహించిన రవి గొడ్డలితో ఆమె మెడపై దాడి చేశాడు. గాయపడిన రుక్మిణీని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.