అసిఫాబాద్: జైనూర్ పోలీస్ స్టేషన్ లో మహిళ మిస్సింగ్ కేసు నమోదు: ఎస్సై రవి
జైనూర్ మండలంలోని గూడమామడ గ్రామానికి చెందిన ఊర్మిళ (30) అనే మహిళ ఈనెల 11న అదృశ్యమైనట్లు జైనూర్ ఎస్సై రవి తెలిపారు. ఎస్సై రవి తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 11న ఇంట్లో నుంచి జైనూర్ కు ఆటో లో వెళ్లింది. సాయంత్రం అయినా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు బంధువుల ఇంటికి వెతికిన ఆచూకీ లభించలేదు. దీంతో వారి కుటుంబ సభ్యులు ఆదివారం జైనూర్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు.ఎవరికైనా ఆచూకీ తెలిస్తే జైనూర్ పోలీసులకు సమాచారం అందించాలని జైనూర్ ఎస్ఐ రవి తెలిపారు.