నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని శ్రీ కాళికామాత ఆలయంలో 41 రోజులపాటు భక్తిశ్రద్ధలతో భవాని మాలను ధరించిన భక్తులు గురువారం దీక్షల విరమణ సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు, ఆలయ ప్రధాన అర్చకులు విల్లనూరు చంద్రశేఖర ఆచార్య ఆధ్వర్యంలో భవాని భక్తులు శ్రీ కాళికామాత అమ్మవారికి ప్రత్యేక పూజలు గావించి, ఇరుముడులను కట్టుకొని విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి సన్నిధిలో దీక్షలను విరిమించేందుకు బయలుదేరి వెళ్లారు