ప్రకాశం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు, బలమైన ఈదురుకారులతో విద్యుత్ సరఫరాకు అంతరాయం, మరో రెండు రోజుల పాటు వర్షాలు
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంతోపాటు కనిగిరి, పుల్లల చెరువు, హనుమంతునిపాడు, కంభం, దర్శి, పామూరు మండలాలో మంగళవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి వాతావరణం ఎండగా ఉండగా, మధ్యాహ్నం ఒక్కసారిగా వర్షం కురవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాహనదారులు, చిరు వ్యాపారులు అవస్థలు పడ్డారు. ఆయా మండలాల్లోని వీధులు, కాలనీలు జలమయమయ్యాయి. కనిగిరి మండలం కంచర్లవారిపల్లిలో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి.