పదవీ విరమణ ఉద్యోగి హసనాపురం బాలాజీ రావు సేవలు ప్రశంసనీయమని ఇంచార్జ్ హెచ్ ఎం జి.చంద్రశేఖర్ అన్నారు. వాల్మీకిపురం మండలం కొత్త మంచూరు జిడ్పీ హైస్కూల్ నందు ఆఫీస్ సబార్డినేట్ గా పనిచేసి శుక్రవారం పదవీవిరమణ పొందుతున్న సందర్భంగా బాలాజీ రావు కు పాఠశాల ఇంచార్జి హెచ్ ఎం జి.చంద్రశేఖర్ మరియు ఉపాధ్యాయ బృందం శాలువాలు కప్పి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ నిగర్వి నిడారంబరుడు అయిన హస్తినాపురం బాలాజీ రావు ఆఫీస్ సబార్డినేట్ గా 34 సంవత్సరాలు పనిచేసి ఎనలేని సేవలు అందించి ఎంతోమంది మన్ననలను పొంది నేడు పదవి విరమణ పొందడం ప్రశంసనీయం అని అన్నారు.