కుందుర్పికు చెందిన వార్త రిపోర్టర్ తిమ్మప్ప తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులతో కలిసి కళ్యాణ దుర్గం పోలీస్ స్టేషన్ వద్ద శనివారం ధర్నా చేపట్టారు. రిపోర్టర్ తిమ్మప్ప మాట్లాడుతూ శుక్రవారం జీడిపల్లి కి చెందిన గంగాధర్,ఆదినారాయణలు తనపై దాడి చేశారన్నారు.పోలీసులకు వెంటనే ఫిర్యాదు చేశానన్నారు.పోలీసులు ఇంతవరకు దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయలేదన్నారు. కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తానని హెచ్చరించారు.