8 గంటల్లో 20 ఎకరాల్లో అలసంద విత్తువేసి బొమ్మనహాల్ మండలం గోవిందవాడ గ్రామానికి చెందిన ఎర్రిస్వామి అనే రైతు ఎద్దులు రికార్డు సృష్టించాయి. అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కాడెద్దులతో గ్రామానికి చెందిన చెన్నబసయ్య పొలంలో గురువారం ఉదయం 5 గంటల నుండి మద్యాహ్నం 1 గంట వరకూ విత్తన గొర్రు తోలాడు. మామూలుగా అయితే ఏడెనిమిది ఎకరాలకు మించి సాగు చేయలేరు. అయితే తాను చెప్పినట్టు వినే ఎద్దులు కలిగిఉన్న ఆ రైతు ఏకంగా 20 ఎకరాలు సాగుచేయడం రికార్డు. దీంతో గ్రామస్తులు పలువురు ఆ రైతును కాడెద్దులను అభినందిస్తూ ఊరేగింపుగా పొలం నుంచి ఇంటికి తీసుకువచ్చారు. శభాష్ అంఠూ పలువురు రైతులు కితాబు ఇచ్చారు.