కణేకల్లు మండలంలోని తుంబిగనూరు వద్ద హెచ్ ఎల్ సి ప్రధాన కలువలో లభ్యమైన మృతుడి వివరాలు తెలిశాయి. కణేకల్లు మండల కేంద్రంలోని నేసే పేట ఏరియాకు చెందిన తిప్పేస్వామి గా పోలీసులు గుర్తించారు. మృతుడు మూడు రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. స్థానిక పోలీసు స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదైంది. అయితే మంగళవారం మృతదేహం హెచ్ఎల్సీ లో కొట్టుకు రావడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.