క్క్రిస్మస్ పండుగ వేళ కృష్ణాజిల్లా వ్యాప్తంగా సందడి నెలకొంది. పండగ సంబరాల్లో భాగంగా వస్త్ర దుకాణాలు వినియోగదారులతో కిక్కిరిసిపోయాయి. పిల్లలు, యువత, మహిళలు కొత్త దుస్తుల కొనుగోళ్లలో నిమగ్నమయ్యారు. అటు ప్రార్థనా మందిరాల అలంకరణకు అవసరమైన పూలు, పండ్ల కొనుగోళ్లతో మార్కెట్లు కళకళలాడుతున్నాయి. క్రైస్తవ సోదరులు ఉత్సాహంగా వేడుకలకు సిద్ధమవుతున్నారు.