ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలో మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్పేయి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించి ఆయనను కొనియాడారు. కనిగిరి రూరల్ కన్వీనర్ మనోజ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు బిజెపి నాయకులు తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి చిన్నారులకు చాక్లెట్లు కేకులు పంచి పెట్టారు.