వేంపల్లె అటవీ రెంజ్ పరిధిలోని చిలేకంపల్లి బీట్ లో నెమలిని చంపిన కేసులో మెదరి గంగన్న అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఫారెస్ట్ రేంజర్ బాల సుబ్రమణ్యం తెలిపారు. చక్రాయపేట మండలంలోని కొలవాండ్లపల్లె గ్రామ పరిధిలోని చిలేకంపల్లి బీట్ లో వేంపల్లెలోని శ్రీరాం నగర్ కు చెందిన మెదరి గంగన్న అనే వ్యక్తి శుక్రవారం నాడు నెమలిని వెంటాడి చంపినట్లు ఫారెస్టు రెంజర్ తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు చిలేకంపల్లి బీట్ లోకి వెళ్లి పరిశీలించగా నెమలిని చంపిన ఘటనను గుర్తించడంతో పాటు నిందితుడిని కూడ అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.