అల్లాదుర్గం: సీతాఫలాల కోసం వెళ్లి వ్యక్తి మిస్సింగ్ బావిలో గాలింపు చర్యలు
Alladurg, Medak | Sep 22, 2025 మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గం లోని అల్లాదుర్గం మండలం గొల్ల కుంట పంచాయతీ కోమటికుంట తండా కు చెందిన బర్మావత్ జయరాం(28)ఆదివారం సీత ఫలాల కోసం వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు అతని కోసం వెతుకుతుండగా తాండ సమీపంలోని భావి వద్ద అతని చెప్పులు ఫోన్ కనిపించాయి. దీంతో అనుమానంతో సోమవారం నాడు బావిలో గాలింపు చర్యలు చేపట్టారు.మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.