పాణ్యం: మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కలెక్టర్కు ప్రజా సమస్యలపై అర్జీ
కర్నూలు జిల్లా కలెక్టర్ ఏ.సిరిని పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కలిసి కల్లూరు మండలం బొల్లవరం, ఓర్వకల్లు మండలం మీదివేముల గ్రామాల సమస్యలను వివరించి అర్జీ సమర్పించారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ మీదివేముల ప్రభాకర్ రెడ్డి, కార్పొరేటర్ నారాయణ రెడ్డి, పాలకొలను రమేష్, చాంద్ బాషా తదితరులు పాల్గొన్నారు.