అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం రేణుమాకులపల్లి లో ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ.ఘర్షణలో ధనుంజయ అనే వ్యక్తికి తీవ్ర గాయాలవ్వడంతో మెరుగైన చికిత్స కోసం హుటాహుటిన అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.