ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలు అన్నింటినీ పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని గుంతకల్ ఆర్డీవో శ్రీనివాస్ ఆదేశించారు. యాడికి రెవెన్యూ కార్యాలయంలో బుధవారం గ్రామ సర్వేర్లు, వీ ఆర్ వో లతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడారు. అర్జీలపై విచారణ చేసి పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహశీల్దార్ ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు.