కొలిమిగుండ్ల మండలం బెలుంగుహలలో బైకు ఢీకొన్న ట్రాక్టర్ డ్రైవర్ పై కేసు నమోదు చేసినట్లు CI రమేష్ బాబు మంగళవారం వెల్లడించారు. అవుకు మండలం చెర్లోపల్లి గ్రామానికి చెందిన ఉప్పర మధు, బోయ హరికృష్ణ మోటార్ సైకిల్ పై కొలిమిగుండ్లకు వస్తుండగా నాయినిపల్లెకు చెందిన ట్రాక్టర్ ఎదురుగా వచ్చి బైకును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుల ఫిర్యాదుతో ట్రాక్టర్ డ్రైవర్ పై కేసు నమోదు చేశామన్నారు.