పెండింగ్ లో ఉన్న కీలక కేసుల విచారణను వేగవంతం చేయాలని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి అన్నారు. సింగరాయకొండ సర్కిల్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం జిల్లా పోలీస్ అధికారులతో సమావేశాన్ని SP హర్షవర్ధన్ ఆధ్వర్యంలో ఐజీ నిర్వహించారు. కార్యక్రమంలో ఐజీ మాట్లాడుతూ.. జిల్లాలో గంజాయి రవాణాను పూర్తిగా అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల నివారణపై దృష్టి పెట్టాలన్నారు.