ప్రకాశం జిల్లా కంభం మండలం జంగంగుంట్ల గ్రామ సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. సాంకేతిక లోపంతో రోడ్డుపై నిలిచి ఉన్న వరి కోత మిషన్ ని వెనక నుంచి ఢీ కారు ఢీ కొట్టింది. ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని మొదట కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం మార్కాపురం తరలించారు. క్షతగాత్రులు గిద్దలూరు కు చెందిన గోపి దేశి శేఖర్, గోపి దేశి చెంచులక్ష్మి, గోపి దేశి కళ్యాణ్ రామ్ గా పోలీసులు తెలిపారు. ప్రమాదంపై స్థానిక పోలీసులు విచారణ జరుపుతున్నామని వెల్లడించారు.