ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల జన్మదిన వేడుకలను ఆళ్లగడ్డ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బరుగొడ్ల హుస్సేన్ భాష ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా బరుగొడ్ల హుస్సేన్ భాష మాట్లాడుతూ దేశానికి ఇందిరా గాంధీ చేసిన సేవలు ఎప్పటికీ మరవ లేనివని ఆమెను ఉక్కు మహిళగా పిలిచినట్లే, రాష్ట్రంలో ఆంధ్ర ఉక్కు మహిళగా మన షర్మిల నిలుస్తున్నారు అన్నారు. ప్రజల సంక్షేమం కోసం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం షర్మిల నిరంతరం పోరాడుతున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో షర్మిలని రాష్ట్ర తొలి మహిళా ముఖ్యమంత్రిగా చేయాలనే