ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని 16వ నంబర్ జాతీయ రహదారి టోల్ ప్లాజా వద్ద శుక్రవారం, స్థానిక సీఐ హజరతయ్యా వాహనదారులకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ఇటీవల ఈ ప్రాంతంలో పెరుగుతున్న ప్రమాదాల నేపథ్యంలో, ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు, సీఐ వాహనదారులను అప్రమత్తం చేసి, నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని సూచించారు.