ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా ద్విచక్ర వాహనదారులకు బుధవారం పోలీసులు హెల్మెట్ పై అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ద్విచక్ర వాహనం నడుపుతున్న వాహనదారులతో హెల్మెట్ ధరించి వాహనం నడుపుతామని పోలీసులు ప్రతిజ్ఞ చేయించారు. ద్విచక్ర వాహనం నడిపే వ్యక్తితో పాటు వెనక కూర్చున్న వ్యక్తి కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు హెల్మెట్ లేకపోతే కలుగు అనర్ధాలు వివరించి జాగ్రత్తగా తీసుకోవాలని పోలీసులు తెలిపారు.