ఐరన్ ఫోలిక్ మాత్రతో రక్తహీనత నియంత్రణ సాధ్యమని పీలేరు మండలం తలుపుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రధాన వైద్యాధికారి డా:శ్రీ గిరీష పేర్కొన్నారు. గురువారం డాక్టర్ శ్రీగిరీష తలుపుల ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఐరన్ ఫోలిక్ మాత్రలు పంపిణీ చేసి సలహాలు సూచనలు ఇచ్చారు.డాక్టర్ శ్రీగిరీషా మాట్లాడుతూ రక్తములో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే రక్తహీనత అంటామని, విద్యార్థి యొక్క అభివృద్ధి ఆలస్యానికి ఇదో కారణం కావచ్చునని తెలిపారు.విద్యార్థులు శారీరకంగా,మానసికంగా ఎదిగి, వారి విద్యాబ్యాసంలో మెరుగైన పనితీరు కనపర్చడానికి ప్రతి గురువారం పాఠశాలలో పంపిణీ చేసే ఐరన్ మాత్రలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు