నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో గత మూడు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో కమిషనర్ నెల్లూరు నగరంలో పర్యటించారు. వర్షపు నీరు రోడ్లమీద నిలబడకుండా సాఫీగా వెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. లీల మహల్ సెంటర్లో టౌన్ ప్లానింగ్ ఇంజనీరింగ్ విభాగాలకు సంబంధించిన అధికారులతో ఆయన పర్యటించారు.