రాయదుర్గం: దర్గాహొన్నూర్ గ్రామంలో ఉరుసు ఉత్సవాల్లో కీలకఘట్టమైన షంషీర్ దేవుడి సవారీకి తరలివచ్చిన వేలాది మంది భక్తులు
మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన బొమ్మనహాల్ మండలంలోని దర్గాహోన్నూర్ గ్రామంలోని వన్నూరు వలి ఉరుసు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో కీలకఘట్టమైన షంషీర్ దేవుడి సవారీకి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. మంగళవారం తెల్లవారుజాము వన్నల్లిలో ప్రారంభమైన ఈ గుర్రం సవారీ ఊరేగింపు అత్యంతం పకీర్ల భజన కీర్తనల మద్య దర్గాకు చేరుకుంది. రూరల్ సీఐ వెంకటరమణ ఆధ్వర్యంలో ఎస్ఐ లు నభిరసూల్, నాగమధు, గురుప్రసాద్ రెడ్డి, వారి సిబ్బందితో గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు.