మేడిపల్లి హెచ్ఎండిఏ అవుట్ అభివృద్ధి పనులు మూడేళ్లుగా ఆలస్యం కావడంపై కొనుగోలుదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ సబ్స్టేషన్, ఓవర్ హెడ్ ట్యాంకు, రోడ్డు పనులు ఇంకా పూర్తి కాలేదని, హెచ్ఎండిఏ అధికారులు పెనాల్టీలు వసూలు చేస్తూ అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్య వహిస్తున్నారని ఆరోపించారు. మేడ్చల్ నియోజకవర్గం లోని ఈ లేఅవుట్ లో కొనుగోలుదారులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు.