కార్తీక మాసంలో శివారాధనకు, స్నానాలకు దీపారాధనకు ప్రాముఖ్యత ఉంది. అందులో భాగంగా కార్తీకమాసం మొదటి సోమవారం పురస్కరించుకొని శివాలయాలు దీపాల కాంతులతో శోభాయమానంగా దర్శనమిచ్చాయి. డోన్ నియోజకవర్గం లో వెలసిన శివాలయంలో మహిళలు భక్తిశ్రద్ధలతో దీపాలు వెలిగించడమే కాకుండా, శివనామస్మరణతో ఓంకారం ఆకారంలో కార్తీక దీపాలు వెలిగించారు.