జాగృతి జనం బాట కార్యక్రమంలో జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ సందర్శనకు వెళ్ళిన తెలంగాణ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను లోనికి డంపింగ్ సిబ్బంది అనుమతించలేదు. గత కొంతకాలంగా జవహర్ నగర్ నుంచి డంపింగ్ యార్డ్ తరలించాలని ప్రజలు, రాజకీయ పార్టీలు డిమాండ్ చేశారు. ఎన్జీటీ కూడా ఉత్తర్వులు ఇచ్చిన అమలు కాలేదు. ప్రజల విజ్ఞప్తి మేరకు కవిత డంపింగ్ యార్డ్ వద్దకు వెళ్లారు.