సికింద్రాబాద్ పరిధిలోని ఆర్కే పురం డివిజన్లో బిజెపి నాయకులతో నిర్వహించిన సమావేశంలో బిజెపి ఓబీసీ మోర్చా అధికార ప్రతినిధి బిబిఆర్ వేణు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడుతూ రానున్న జిహెచ్ఎంసి ఎన్నికల్లో బిజెపిని ఓడించేందుకు ప్రభుత్వం అశాస్త్రీయ పద్ధతిలో డివిజన్ల విభజన చేసిందని అన్నారు. రానున్న ఎన్నికలలో పూర్తిస్థాయిలో బిజెపి విజయం సాధిస్తుందని మేయర్పీఠం బిజెపికే దక్కుతుందని తెలిపారు.